ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..జెన్‌కో సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

-

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జెన్‌కో సిబ్బందికి బయోమెట్రిక్ ప్రకారం హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. జెన్ కో సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ సంస్థ ఎండి శ్రీధర్ నిర్ణయం తీసుకున్నారు.

లంచ్ విరామ సమయంలోను బయోమెట్రిక్ వాడాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని… హాజరులో సవరణ ఉంటే సంబంధిత అధికారికి తెలపాలని… లేకుంటే సెలవు కింద పరిగణిస్తామన్నారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అనుమతిస్తామని.. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రూల్స్ అమలు అవుతాయని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news