బ్రేకింగ్ : కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి..!

-

కరోనా కారణంగా బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కన్నుమూశారు. పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారని పేర్కొన్నారు. సునీల్ సింగ్ మరణంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు.

corona
 

సునీల్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ సైతం సునీల్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే ఇప్పటికే కరోనాతో బీహార్ మండలి చైర్మన్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో మరో నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news