బిజెపి 119 స్టానాల్లో గెలుస్తుంది – బండి సంజయ్

-

కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయిందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎవరైనా ఎన్నికలలో గెలుస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ ఒడిపోతామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసికూడా యాత్రలు ఎందుకన్నారు సంజయ్. వచ్చే ఎన్నికలలో 119 స్తానాల్లో బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు సపరేటుగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమేనన్నారు. మోడీ నిజాయితీపరులు కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారని అన్నారు. కెసిఆర్ ఇంకా ఈటెల రాజేందర్ ఆయన మనిషేనని అనుకుంటున్నారని అన్నారు. ఇక బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ డిప్రెషన్లో ఉన్నాడని..కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందన్నారు.

ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీ కలలుగనేదని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నదన్నారు. కుటుంబ పాలన ,అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బిఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ బి టీం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. 119 స్థానంలో బిజెపి పోటీ చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news