త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ 2 మొదలవుతుంది – తరుణ్ ఛుగ్

-

త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ 2 మొదలవుతుందన్నారు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్. మార్చ్ 31 వరకు ఈ సమావేశాలు, సభలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి బహిరంగ సభ త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి పై, బిజెపి పై నమ్మకం ఉందన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తరుణ్ చుగ్.

రాష్ట్రంలో కెసిఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణలో అవినీతి గల్లి స్థాయి నుంచి ఢిల్లీ, పంజాబ్ స్థాయి వరకు వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రజల సమస్యలపై కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించేందుకు పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. వచ్చే ఎన్నికలలో 119 స్థానాలలో బిజెపి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news