రఘు రామకృష్ణంరాజును హత్య చేయటానికి ప్లాన్ చేశారు -బోండా ఉమా

-

రఘు రామకృష్ణంరాజును హత్య చేయటానికి ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు బోండా ఉమా. హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్సప్రెస్సులో రఘు రామకృష్ణం రాజుభీమవరం వచ్చుంటే అదే చివరి రోజయ్యేదని… రఘురామకృష్ణంరాజుకు దాడి సమాచారం రాగానే బేగం పేటలో రైలు దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడని పేర్కొన్నారు.

ఇది నిజం కాదని వైసీపీ అంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి నిజాలు తెలుస్తాయని… ప్రధాని ఏపీ వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే జగన్ప పాలనా ఎలా వుందో అర్థమవుతుందని ఫైర్‌ అయ్యారు. జగన్ ప్రభుత్వానికి చిత్త శుద్ది వుంటే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పుటేజ్ ని బయట పెట్టాలని.. మొన్న సతెనపల్లిలో 100 మంది గుండాలతో ఎంపీ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారని మండిపడ్డారు.

వైసీపీకి చిత్త శుద్ది వుంటే సీబీఐ విచారణ జరిపించాలని… మొసలి తన పిల్లల్ని తానే ఎలా తింటుందో జగన్ నైజం అలాంటిదని ఆగ్రహించారు. వివేకానంద హత్యతో ఇది నిరూపితమైందని… వివేకానందరెడ్డి కేసును నీరుగార్చడానికి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు ఇంటి చుట్టూ ఏపీ సీబీసీఐడీ ఎందుకు నిఘా వేశారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం రాకలో సీఎం జగన్ ఎంతుకంత అత్యుత్సాహం చూపారు..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version