ఉద్యోగులను పని దొంగలుగా చూడొద్దు : బొప్పరాజు

-

జగన్ ప్రభుత్వం పై ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. సమస్యలు పరిష్కరించమని కోరిన ఉద్యోగులను ప్రభుత్వం పని దొంగలుగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

ఉద్యోగుల పనితీరు, హాజరు పై ఫ్లయింగ్ స్క్వాడ్ల తో తనిఖీలు చేయించడం.. ఘోర అవమానం అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని ఇది దెబ్బతీయడమేనని… ఇలాంటి చర్యలను జగన్ ప్రభుత్వం మానుకోవాలని కోరారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. లేకపోతే ఏపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news