అనంతబాబు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు : మంత్రి బొత్స..

-

ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ మృతి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన ఎక్కడో వివాహానికి హాజరైనట్టు తాను మీడియాలో చూశానని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన ఏ తప్పు చేసి ఉండకపోవచ్చని, ఆ ధైర్యంతోనే ఆయన అలా తిరిగుతుండొచ్చని అన్నారు బొత్స సత్యనారాయణ. అనంతబాబుపై తాము కేసు నమోదు చేశామని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఆయన తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టై ఉండేవారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో వారు రెండు రోజులపాటు నిర్లక్ష్యం చేశారని మంత్రి బొత్స విమర్శించారు. ఈ నెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో నిన్న సమావేశమైన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version