ఉత్తరాంధ్ర భూ బకాసురుడు.. చిప్ప కూడు విజయసాయి రెడ్డి : బుద్దా వెంకన్న

-

ఉత్తరాంధ్ర భూ బకాసురుడు విజయసాయిరెడ్డి అని.. జగన్ సర్కారుకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని హెచ్చరించారు బుద్దా వెంకన్న. బీసీలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని… తమ చెప్పు చేతుల్లో ఉండేవారికి మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నారని ఆగ్రహించారు. బీసీలపై జగనుది కపట ప్రేమ. బీసీలను ఆర్ధికంగా వైసీపీ దెబ్బతీసింది. ఏపీలో రూ. 2 వేల రూపాయల నోట్లు దొరక్కుండా వైసీపీ దాచి పెట్టిందన్నారు. కాకాని కేసులో సాక్ష్యాలని కోర్టు నుంచే దొంగిలించడం దుర్మార్గమని.. జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సీబీఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలి.

వివేకా హత్య కేసులో ఆధారాలు కూడా భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ కుల పార్టీనా, టీడీపీ కుల పార్టీనా తేల్చుకుందాం రా..అని విజయ సాయికి సవాల్‌ విసిరారు బుద్దా వెంకన్న. ఉత్తరాంధ్రకు జగన్ నిన్ను ఇన్ఛార్జిగా వేస్తే.. చంద్రబాబు నన్ను ఇన్ ఛార్జీగా వేశారని… మరి ఎవరిది కుల పార్టీ, ఎవరు కులం చూసుకున్నారన్నారు. జగన్ అవినీతిలో భాగమై, జైలుకెళ్లినందుకే మీకు రాజ్యసభ సీటు ఇచ్చారని.. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలే పోయాయని మండిపడ్డారు.

ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారని.. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసున ఘనుడు జగన్అని ఆగ్రహించారు. కొడాలి నాని, వెల్లంపల్లి, రంగరాజు చెప్పారని వారి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేదు… ఆ మాజీ మంత్రులకూ.. జగనుకు మధ్య ఉన్న డీలింగ్స్ ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ సామాజిక వర్గాలలో‌ వాళ్లే మంత్రులు కావాలా…? ఆ మాజీ మంత్రులు బినామీలుగా ఉన్నారు కాబట్టే జగన్ ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేశారు. విజయసాయి రెడ్డి వయసుకు తగ్గ విధంగా‌ మాట్లాడాలి.. లోకేషుకు నిక్ నేమ్ పెడితే.. మేము చిప్ప కూడు విజయసాయి రెడ్డి అని‌ పిలుస్తామని హెచ్చరించారు. జగనుకు సూట్ కేసుల కంపెనీ మోసిన చరిత్ర విజయసాయి రెడ్డిదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news