Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

-

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలోపడి అందులో ప్రయాణిస్తున్న ఒక ఇమామ్, ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మృతిచెందారు. ఉదంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ నలుగురు రాంబన్ జిల్లాలోని గూల్‌-సంగల్‌దాన్ గ్రామం నుంచి జమ్ముకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

Telangana: Four killed in road accident on national highway in Adilabad  district | Cities News,The Indian Express

కారు అదుపుతప్పి 700 అడుగుల లోయలోకి జారిపడిందని చెప్పారు. ఈ ప్రమాదంలో జామియా మసీదు ఇమామ్ ముఫ్తి అబ్దుల్ హమీద్ (32), ఆయన తండ్రి ముఫ్తి జమాల్ దిన్ (65) అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన తల్లి హజ్రా బేగం (60), మేనల్లుడు అదిల్ గుల్జార్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా కన్నుమూశారు. మృతదేహాలను పోస్ట్‌మార్గం కోసం మార్చురీకి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news