జ‌గిత్యాల‌లో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ పై కేసు?

-

జిగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డు రేవంత్ రెడ్డి పై కేసు న‌మోదు చేయాల‌ని టీఆర్ ఎస్ అనుభంద సంస్థ‌లు పోలీసు స్టేష‌న్ లో ఫీర్యాదు చేసాయి. గ‌త కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డు రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కేసీఆర్ ను రాళ్ల తో కొట్టి పాత‌ర వేయాల‌ని అన్నారు.

అలాగే కేసీఆర్ ను ఊరి తీయాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్య ల‌తో టీఆర్ ఎస్ సోష‌ల్ మీడియా విభాగం తో పాటు విద్యార్థి నాయ‌కులు పోలీసులకు ఫీర్యాదు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ పై కేసు న‌మోదు చేయాల‌ని అన్నారు. అలాగే రేవంత్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. అయితే హుజురాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయా నాయ‌క‌ల విమ‌ర్శ‌లు తీవ్ర స్థాయి కి చేరాయి. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు వ్య‌క్తి గ‌త విమ‌ర్శ‌ల కు కూడా దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version