సడెన్ గా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో సిబిఐ అధికారులు…

-

మాజీ ఎంపీ వివేకా హత్య కేసును ఎలాగైనా త్వరగా ముగించాలని సిబిఐ విచారణను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా కొంతకాలంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని తీక్షణంగా ఫాలో అవుతోంది. ఈ కేసులో అతని ప్రమేయం ఉందని కంఫర్మ్ అయ్యాకనే ఇలా వ్యవవహరిస్తోంది. అయితే నిన్న సిబిఐ విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డి రావాలని నోటీసులు ఇచ్చినా, గైర్హాజరయ్యారు. దీనితో మరో రెండు రోజుల్లో సిబిఐ విచారణకు హాజరు కావాలని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇంతలోనే ఇద్దరు సిబిఐ అధికారులు పులివెందులలోని తన నివాసానికి రావడం స్థానికంగా సంచలనముగా మారింది. ఇంట్లోకి వెళ్లిన సిబిఐ అధికారులు అక్కడ ఏమైనా అనుమానాస్పదంగా మార్పులు జరిగాయా అని పరిశీలించారు.

కాగా ఇంత సడెన్ గా ఎందుకు సిబిఐ అధికారులు వచ్చారన్న విషయంపై పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఈ కేసులో ఇంకేమైనా ముందుకు వెళుతుందా తెలియాలంటే మే 19 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news