ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 17 పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెంచినట్లు వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ

2021-22లో కేంద్రం వరికి కనీస మద్దతు ధర రూ.1940 ప్రకటించింది. దీంతో క్వింటాల్‌కు ధాన్యం ధర రూ.2040కు పెరిగింది. సోయాబిన్‌కు క్వింటాల్‌కు రూ.300, కందులపై రూ.300, పెసర్లుపై రూ.480, నువ్వులపై రూ.523, పొద్దు తిరుగుడుపై రూ.385 కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారత్‌లో యూరియా నిల్వలు తగినంత ఉన్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news