CAA పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

-

త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. CAAపై దేశంలోని పలువురు ముస్లింలు ఆందోళన చెందుతున్నారు . ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనచేసింది. ‘CAAపై భారత ముస్లింలు ఆందోళనలు చెందవద్దు అని ,ఇక్కడ మైనార్టీలపై సీఏఏ ఎలాంటి ప్రభావం చూపదు తెలిపారు.. భారత ముస్లింలందరికీ హిందువులతో పాటు సమాన హక్కులు ఉంటాయి’ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version