జగన్ ఓ దరిద్రం.. ఏపీకి పట్టిన అరిష్టం, ఐరన్ లెగ్ – చంద్రబాబు

-

జగన్ ఓ దరిద్రం.. ఏపీకి పట్టిన అరిష్టం, ఐరన్ లెగ్ అని చంద్రబాబు ఓ రేంజ్‌ లో చెలరేగిపోయారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు భరోసా ఇస్తూ మీటింగ్ పెడితే దొంగల్లా దూరారని.. దాన్ని ఏ2 సమర్థిస్తాడా..? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు బరితెగించారు.. లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని.. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరు.. వస్తానంటే రమ్మనండి.. చూద్దామని సవాల్‌ విసిరారు.

నేరస్తులకు నేరాలోచనలే వస్తాయని.. ఎన్నిసార్లు వస్తారో రమ్మనండి చూద్దాం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. పిల్లలని టెన్షన్ పడేలా చేశారు… టీచర్లని మద్యం దుకాణాల వద్ద పెట్టినప్పుడే మానసికంగా టీచర్లు చనిపోయారు… టీచర్ల గౌరవాన్ని తగ్గించారని ఫైర్‌ అయ్యారు.

వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేయాలనుకుంటారా..? మంత్రి భార్య కాపురం చేయకున్నా మేమే బాధ్యతా..? వ్యవసాయాన్ని నాశనం చేశారు కాబట్టే క్రాప్ హాలిడే ప్రకటించారని విమర్శలు చేశారు. రైతులే కాదు.. ఆక్వా, హర్టీకల్చర్ రైతులు కూడా హాలిడే ప్రకటించనున్నారు. వ్యవస్థలను ధ్వంసం చేశారు కాబట్టే అరిష్టం పట్టిందని జగన్‌ పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news