విజయసాయిరెడ్డి రేంజ్ కి మా ఆఫీసులో అటెండర్ చాలు: అయ్యన్న పాత్రుడు

-

పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. దీనిపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.” విద్యార్థులను అడ్డుపెట్టుకుని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. జూమ్ లో కాదు.. నేరుగా వచ్చినా మీరు ఏమీ చేయలేరు.

పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి కుక్కల్ని పంపడం కాదు. జగన్ రెడ్డి.. స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా చానల్ లోనే చర్చించుకుందాం” అని లోకేష్ సవాలు చేశారు. లోకేష్ సవాల్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పు అంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు.

జూమ్ మీటింగ్ లోకి వస్తే మ్యూట్ చేశావు.. ప్రత్యేకంగా వస్తే తట్టుకోగలవా లొకేశం?” అంటూ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “దొంగ లెక్కలు రాసి ఊచలు లెక్క పెట్టిన నువ్వు.. సవాల్ విసరడం ఏంటి సాయి రెడ్డి?. నీ రేంజ్ కి మా ఆఫీసులో అటెండర్ చాలు. లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్ తో.. మీ వాడికి దమ్ముంటే చర్చకు రమ్మను. లోకేష్ ఈజ్ రెడీ”. అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news