ఏ వాంగ్మూలం చూసినా..వివేకా హత్యలో దోషి అసలు జగనే : చంద్రబాబు

-

టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని.. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని ఫైర్ అయ్యారు. వివేకా హత్య నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని చెప్పారు.

హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే.. ఏమవుతుంది.. నాపై 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని… బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిందని.. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.. ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా..? అని పేర్కొన్నారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్ని హత్య చేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా ? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news