భజన బృందం..బాబు మునిగేవరకు!

-

గత ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడటానికి అనేక కారణాలు ఉన్నాయి…అయితే ముఖ్యంగా బాబు గారి భజన బృందం వల్ల టీడీపీ బాగా నష్టపోయిందని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్న కొందరు నేతలకు ఒకటే పని…ఎంతసేపు బాబుకు బాకా ఊదడం…ఆహా మీ అంత తోపు లీడర్ ఎవరు లేరని చెప్పి భజన చేయడం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ భజన బృందానికి ఎక్కువ పని ఉండేది..పదవులు దక్కించుకోవడం కోసం…లేనిది..ఉన్నట్లుగా క్రియేట్ చేసి..వారు బాబుని మునగచెట్టు ఎక్కించే ప్రయత్నాలు చేసేవారు.

పైగా బాబు కూడా నిజాలు చెప్పేవారు కంటే..భజన చేసేవాళ్ళనే తన చుట్టూ పెట్టుకునేవారు. దీని వల్ల అసలు కింది స్థాయిలో ఏం జరుగుతుందో బాబుకు తెలిసేది కాదు…కార్యకర్తలు ఎంత అసంతృప్తిగా ఉన్నారు…పాలన పట్ల ప్రజలు ఎలా విసిగిపోయి ఉన్నారనేది తెలిసేది కాదు..ఎంతసేపు తమ పాలన పట్ల 90 శాతం సంతృప్తిగా ఉన్నారు…95 శాతం ఉన్నారని బాబు చెప్పుకొచ్చేవారు.

ఇలా భజన చేసే నాయకుల వల్ల గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవ పరిస్తితులు బాబుకు తెలియకపోవడం వల్ల టీడీపీకి బాగానే నష్టం జరిగింది…ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఎదురైంది. మరి ఓడిపోయాక బాబు మారి…భజన చేసే వాళ్ళని పక్కన పెట్టారా? అంటే పెట్టలేదనే చెప్పొచ్చు. ఇప్పటికే బాబు చుట్టూ చేరి భజన చేసే నాయకులే ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ మధ్య సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన కేశినేని నాని సైతం ఇదే తరహా విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు…మంచి చెప్పే వాళ్ళకంటే..బ్రోకర్లు, లోఫర్లు మాటే ఎక్కువ వింటారని చెప్పి ఫైర్ అయ్యారు. అంటే పార్టీలో ఉండే కొందరు నేతల వల్లే పార్టీ నాశనమవుతుందని, కానీ బాబు వారి మాటలే నమ్ముతున్నారని పరోక్షంగా హెచ్చరించారు. కేశినేని చెప్పే మాటల్లో నిజం లేకపోలేదు..ఇప్పటికీ కొందరు నేతలు…పార్టీలోని వాస్తవ పరిస్తితులు తెలియనివ్వకుండా బాబుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఇలాగే కొనసాగితే బాబు మళ్ళీ మునగడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news