ఈ నెల 15 నుంచి జిల్లాల పర్యటనకు చంద్రబాబు

-

జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలకు నిర్ణయం తీసుకున్నారు బాబు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ పర్యటించనున్న చంద్రబాబు… జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలల్లో పాల్గొంటారు.

ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండనుండగా.. ఈ నెల మూడో వారం నుంచే ప్రారంభం కానుంది చంద్రబాబు జిల్లాల పర్యటనలు. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యటనలకు వెళ్లనున్న టీడీపీ అధినేత… ఈ నెల 15,16,17 తేదీల్లో చోడవరం, అనకాపల్లి, చీపురుపల్లి సెగ్మెంట్లల్లో పాల్గొననున్నారు.

మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటులోని 7 అసెంబ్లీ ఇన్చార్జులతో సమీక్షలు, క్యాడరుతో ఆత్మీయ సమావేశాలు జరుగనున్నాయి. జిల్లా టూరులో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా కార్యక్రమం ఉండనుంది. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా సాగనున్న టిడిపి అధినేత పర్యటనలు కొనసాగనున్నాయి. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news