Breaking : నేటి నుంచి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. దీని కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 12 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు.. గురవారం పట్టణంలో రోడ్డు షో నిర్వహిస్తారు.

Accept the verdict of the people: Chandrababu Naidu

అనంతరం మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి కర్నూలులో బస చేసి…. శుక్రవారం ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు పరిశీలించారు. పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పర్యటన పార్టీ శ్రేణులు, కర్నూలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, భరోసాను తీసుకొస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news