చెన్నుపాటి గాంధీని ఆసుపత్రిలో పరామర్శించిన చంద్రబాబు

-

శనివారం విజయవాడలో వైసీపీ నేతల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్రమైన గాయమైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నుపాటి గాంధీని పరామర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలపై జరుగుతున్న ప్రతి దాడి వెనుక జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు చంద్రబాబు.

పోలీసులు కూడా ఉన్నారని.. లేకపోతే ఎమోషనల్ గా జరిగిన దాడి అంటూ పోలీసులు మాట్లాడడం ఏంటి? అని ప్రశ్నించారు. గాంధీపై జరిగిన దాడి విషయంలో దోషులకు శిక్ష పడేంత వరకు వదిలిపెట్టేదే లేదన్నారు. హత్య రాజకీయాలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అంటూ మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ రౌడీలు చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు చంద్రబాబు. ఏదో ఒక రోజు వైసీపీ నేతలు కూడా రోడ్లపై తిరగలేని రోజు వస్తుంది జాగ్రత్త! అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news