ఇది ఉద్యోగుల పాలిట రాక్షస సర్కార్ – రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పాలిట రాక్షస సర్కార్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా 42 రోజుల సమ్మెలో 20 మంది వీఆర్ఏలు చనిపోయారని వండిపడ్డారు.

” 42 రోజుల సమ్మెలో 20 మంది వీఆర్ఏలు చనిపోయారు. టిఆర్ఎస్ పాలనలో జీతాలు రాక కొందరు.. ఆలస్యపు జీతాలతో కొందరు.. ఉన్న ఉద్యోగాలు ఎప్పుడూ ఊడతాయో తెలియక కొందరు.. ఇలా ఉద్యోగ వర్గాలు వేదన చెందుతున్నాయి. ఇది ఉద్యోగుల పాలిట రాక్షస సర్కారు”. అని ట్వీట్ చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news