ఆత్మకూరు ఉప ఎన్నికపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

ఆత్మకూరు ఉప ఎన్నికపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని.. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానం అని.. ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని పేర్కొన్నారు.

తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయి… బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో.. ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని తెలిపారు. అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చేయడం పరిపాటిగా మారింది… వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణుపై దాడి చేయడం దారుణమని విమర్శించారు.

స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసీపీ మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే.. సీఎం మౌనం దేనికి సంకేతం..? రివర్స్ టెండర్ల విధానంతో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ మూడేళ్ల నిర్వహణా వైఫల్యమే కారణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news