పేటిఎం యూజర్లకు భారీ షాక్.. ఆ సేవలపై బాదుడు..

-

కరోనా తర్వాత నుంచి డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. మనీ లావాదేవీలు అన్నీ కూడా ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్నాయి..గూగుల్ పే, ఫోన్ పే లు ఇప్పటికే అదనపు చార్జీలను వసూల్ చేస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునే మొబైల్ రీచార్జ్‌లకు సర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

రిచార్జ్ చేస్తున్న అమౌంట్ ను బట్టి అదనపు చార్జీలు ఉంటాయి.పేటీఎం వాలెట్ బ్యాలెన్స్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసినా సరే మోడ్‌తో సంబంధం లేకుండా అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. అయితే, ఇప్పటికిప్పుడు ఇది యూజర్లందరికీ వర్తించదు. పేటీఎం ప్రత్యర్థి అయిన ఫోన్ పే గతేడాదే మొబైల్ రీచార్జ్‌లపై సర్ చార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టింది. కాగా, రూ. 100 పైన జరిగే లావాదేవీలకు కూడా అదనపు చార్జీలు వర్తిస్తాయని తెలుస్తోంది.

గతంలో వినియోగదారుల నుంచి తాము ఎలాంటి కన్వీనియన్స్ రుసుము కానీ, ట్రాన్సాక్షన్ రుసుము కానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, వాలెట్ మోడ్ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ, ఇప్పుడు మొబైల్ రీచార్జ్‌లపై సర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం గమనార్హం.. ఇప్పుడు పేటిఎం యూజర్లకు భారీ షాక్ అనే చెప్పాలి. దీంతో వినియోగదారులు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news