సోషల్ మీడియాలో అలాంటి కంటెంట్ కు చెక్..లేకుంటే?

-

సోషల్ మీడియాలో కొత్త రూల్స్ వస్తున్నాయి..కేంద్రం ప్రభుత్వం ఐటీ రూల్స్‌ని సవరిస్తూ, కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది..సోషల్ మీడియా కంపెనీలకు ఉత్తర్వులు వెళ్లాయి. యూజర్లకు సంబంధించి నియమాలు-నిబంధనలు, గోప్యత విధానం, అగ్రిమెంట్‌.. అన్నీ ఇంగ్లీష్‌తోపాటు అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలన్నది తాజా నిబంధన.. అశ్లీల, విద్వేష, లింగ-జాతి వివక్ష, హవాలా, జూదం లాంటివాటిని ప్రోత్సహించే ఎటువంటి కంటెంటూ పోస్ట్‌ చేయకుండా సోషల్ మీడియా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొత్త రూల్..

ఒక మెసేజ్ ఎక్కడ పుట్టిందన్న సమాచారాన్ని దాచిపెట్టడం లాంటివి సోషల్ మీడియాలో ఇకపై కుదరవంటోంది ఐటీశాఖ..అంతేకాదు.. యూజర్స్‌ నుంచి వచ్చే ఫిర్యాదుల్ని 24 గంటల్లో స్వీకరించి.. వాటిని 15 రోజుల్లోగా పరిష్కరించాలన్న నిబంధన మరింత కీలకమైంది. ఇవన్నీ ట్విట్టర్, మెటా, వాట్సప్ లాంటి కంపెనీల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేవిధంగా ఉన్నాయంటూ కౌంటర్లొచ్చాయి.. ఇల్లీగల్ కంటెంట్‌కి చెక్ చెప్పాల్సిందే అని హెచ్చరించడం డిక్టేటర్‌షిప్ లాంటిదేనన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు మొదలయ్యాయి..

ముందు టీవీ రంగాన్ని..ఇప్పుడు సోషల్ మీడియాను తన హ్యండ్ లో పెట్టుకోడానికే మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది అని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్. సామాన్యుడికి అందుబాటులో ఉండే మీడియా సోషల్ మీడియా ఒక్కటేనని, దాన్ని కూడా లాగేసుకుంటే ఆమ్‌ఆద్మీల బతుకు ఆగమేనని విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. తాజా మార్గదర్శకాలు సోషల్ మీడియా కంపెనీలపై కర్రపెత్తనం చెయ్యడానిక్కాదని, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ని నిరోధించడానికేనని క్లారిటీనిస్తోంది ఇండియన్ ఐటీ శాఖ..దీంతో చాలా కంపెనీలకు షాక్ తగిలందని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news