Breaking : విద్యార్థులకు అలర్ట్‌.. నేటి నుంచి ఎంబీబీఎస్‌ తొలి విడత ప్రవేశాలు

-

ఎంబీబీఎస్‌ చేయాలనుకునే విద్యార్థులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడత కింద ఆదివారం (30వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి నవంబరు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

NMC holds MBBS Admissions At 3 Jharkhand Medical Colleges

తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం www.knrhs. telangana. gov.in వెబ్సైట్ను పరిశీలించాలని వర్సిటీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news