వెంకి కుడుముల కు చిరంజీవి ఒకే చెప్పబోతున్నారా.!

-

ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే ఛలో’ ‘భీష్మ  సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల. ‘భీష్మ ‘సినిమా విడుదల అయ్యి రెండున్నర సంవత్సరాలు అయింది.కాని ఇప్పటి వరకు తన కొత్త సినిమా అప్డేట్ లేదంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

గతంలో తాను చిరంజీవికి కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడని, ఇక షూటింగు మొదలు పెట్టడమే తరువాయి అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు సినిమా గురించి చిరంజీవి కూడా మాట్లాడటం లేదని,ప్రస్తుతం చాలా రోజులుగా సినిమా లేక నిరాశగా వున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని వాస్తవానికి అంతకు ముందు చెప్పిన స్టోరీ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని  మెగాస్టార్ చిరంజీవి చెప్పారట.

ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ, భోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే తొందర లో వున్నారు. చిరు మళ్లీ ఎంటర్టై్మెంట్ స్క్రిప్ట్ చెయాలని పట్టుదల తో వున్నాడు. ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లో వెంకీ కుడుముల కరెక్షన్స్ పూర్తి అయిన స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి కు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సినిమా స్క్రిప్ట్ ఒకే అయితే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఈ భోళా శంకర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక వెంటనే వెంకి కుడుములు సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version