టాలీవుడ్ డైరెక్టర్లకు క్లాస్ పీకిన చిరంజీవి.. కారణం..?

-

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవరికైనా నష్టం వాటిల్లు తోంది అంటే ముందు వరుసలో ఉండి వారికి ఆసరాగా నిలబడుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణలో ఉంచాలని చూసే చిరంజీవి కూడా కొన్ని విషయాలలో ఎవరైనా ఇబ్బంది పెట్టారు అంటే కచ్చితంగా వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడరు. ఇక ఈ క్రమంలోని తాజాగా దర్శకుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసలు కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి క్లాస్ పీకడానికి గల కారణం ఏమిటంటే.. డైరెక్టర్లు షూటింగ్ స్పాట్ కి వచ్చిన తర్వాత నటీనటులకు డైలాగులు రాసిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఫైర్ అవుతున్నారు.. ఇక ఆయన మాట్లాడుతూ షూటింగ్ స్పాట్ కి వచ్చాక డైరెక్టర్లు నటీనటులకు డైలాగులు రాసిస్తున్నారు అని, ఇది నటీనటులకు ఇబ్బంది కలుగుతుంది అని, ముఖ్యంగా తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని..ముందే స్క్రిప్ట్ ఇస్తే పర్ఫామెన్స్ పై దృష్టి పెడతాము కదా ఇలా సెట్ లోకి వచ్చిన తర్వాత డైలాగులు రాసిచ్చి అప్పటికప్పుడు పర్ఫామెన్స్ చేయమంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఇక సమయం కూడా వృధా అవుతుంది . నిర్మాతలకు ఖర్చు ఎక్కువవుతుంది. కనీసం ఇప్పటికైనా మీ పనితీరును మార్చుకోవాలి అంటూ దర్శకులపై మెగాస్టార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇకపోతే మెగాస్టార్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఒకవైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే మరొకవైపు భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలపై దృష్టి పెడుతూ మరింత ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news