‘కేరింత’ సినిమా నుంచి తప్పుకున్న సాయి ధరమ్ తేజ్..కారణమిదే!

-

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో..ప్రస్తుతం ఓ క్రేజీ ఫిల్మ్ చేస్తున్నాడు. చివరగా దేవకట్టా ‘రిపబ్లిక్’ చిత్రంలో ప్రేక్షకులకు కనిపించాడు. కాగా, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘కేరింత’..సాయిధరమ్ తేజ్ చేయాల్సిన పిక్చర్. కాగా, దాని నుంచి తప్పుకున్నాడు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

‘రేయ్’ పిక్చర్ షూటింగ్ కొద్ది రోజుల పాటు జరిగి పలు కారణాల వలన ఆగిపోతున్నది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు తో ‘కేరింత’ ఫిల్మ్ స్టోరి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు సాయిధరమ్ తేజ్ తో ఆ పిక్చర్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. అయితే, ఆ స్టోరి సాయిధరమ్ తేజ్ కు సెట్ అవదేమోనని దిల్ రాజు కు అనుమానం ఉంది. అయినప్పటికీ ఓకే అనేశాడు.

ఇంతలో దిల్ రాజుకు డైరెక్టర్ ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పిక్చర్ స్టోరి చెప్పాడు. హీరో ఎవరు ? అనేది డైరెక్టర్ చెప్పలేదు. దాంతో దిల్ రాజు.. సాయి ధరమ్ తేజ్ పేరు సజెస్ట్ చేసి ఒప్పించాడు. అలా అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి ఆ పిక్చర్ తీశారు.

ఇక ‘కేరింత’ పిక్చర్ ను సుమంత్ అశ్విన్, ఇంకా ఇద్దరు లీడ్ యాక్టర్స్ తో కలిపి చేసేశారు. అలా ‘కేరింత’ పిక్చర్ నుంచి సాయి ధరమ్ తేజ్ తప్పకుని ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్నాడు. ఈ విషయాలు ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news