ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ

-

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్తు తదితర కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే లతో పాటు నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీలో స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ఎన్నికలు ఉండవని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. మంత్రివర్గ మార్పులపై పుకార్లను నమ్మవద్దని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని సీఎం జగన్ మండిపడ్డారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news