టీడీపీ కార్యాలయాలపై దాడి ; జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే !

-

నిన్న తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరియు పట్టాభి ఇంటి పై దాడి చేసిన ఘటనపై మొదటి సారిగా సీఎం జగన్‌ స్పందించారు. ఇవాళ జగన్న తోడు నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. టీడీపీవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని సీఎం జగన్‌ ఫైర్‌ అయ్యారు. వైసీపీ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓర్వేలేకే పచ్చి బూతులు తిడుతున్నారని మండిపడ్డారు.

వాళ్లు తిట్టడం కారణంగానే వైసీపీ అభిమానులు ఆవేశాలకు లోనవుతున్నారని చెప్పుకొచ్చారు సీఎం జగన్‌. తెలుగు దేశం పార్టీ రక రకాల ఆటంకాలు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. కులాలు మరియు మతాల మధ్య కూడా టీడీపీ చిచ్చు పెడుతోందని మండి పడ్డారు. పేదలకు మేలు జరిగితే ఎక్కడ జగన్‌ కు పేరు వస్తుందోనని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలను కూడా మేనేజ్‌ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news