ఈనెల 26 న వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్

-

ఈనెల 26 న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ లోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే పరిహారం, నిత్యవసరాలను పంపిణీ చేసిన ప్రభుత్వం వరద పరిస్థితులను పరిశీలిస్తుంది.

అయితే వరద క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరుతున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతుందని సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితిలను అంచనా వేయడంతో పాటుగా వరద బాధితులతో మాట్లాడేందుకు జగన్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news