బీజేపీ అంటే ఫైర్‌.. కాలిపోతావ్‌ : జగన్‌ కు సునీల్ థియోధర్ వార్నింగ్‌

-

బీజేపీ అంటే ఫైర్‌.. కాలిపోతావ్‌ : జగన్‌ కు సునీల్ థియోధర్ వార్నింగ్‌ ఇచ్చారు. ఆత్మకూరులో ముందస్తు ప్రణాళికతో దాడి చేశారని.. ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన జరిగిందన్నారు. ఎమ్మెల్యే శిల్ప, హఫీజ్ ఖాన్, డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ కుట్రదారులు అని.. ఆత్మకూరులో మసీదు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారని నిప్పులు చెరిగారు. ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మిస్తామంటే ఓర్చుకుంటారా… స్థానికులు ఒప్పుకుంటేనే మందిరం, మసీదు, చర్చి నిర్మించాలన్నారు.

మసీదు నిర్మాణంపై స్టే ఉంది…కుట్ర చేసి ఎమ్మెల్యే శిల్ప మసీదు నిర్మించమని చెప్పారని వెల్లడించారు.
మసీదు నిర్మించండి…ఎవరేమి చేస్తారో చూస్తానని ఎమ్మెల్యే శిల్ప చెప్పారని… శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ముస్లింలు వ్యాపారాన్ని బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారని గుర్తు చేశారు. శ్రీకాంత్ రెడ్డి హిందూ సమాజం కోసం పోరాడితే కేసులు పెట్టారు..ఆత్మకూరు ఘటనలో వీడియో లు చుస్తే భయానకంగా ఉన్నాయన్నారు. ఏపీ లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి…కేరళలో ఉన్న పరిస్థితులు ఏపీ లో రాబోతున్నాయని.. ఆత్మకూరు ఘటనను ఇంతటితో వదిలిపెట్టామని పేర్కొన్నారు. బీజేపీ అంటే ఫైర్ అని ఇంతకు ముందే జగన్ కు చెప్పానని… జగన్… నిప్పులతో చెలగాటం వద్దు…కాలిపోతావ్ అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version