బిజెపి గుండాయిజం చేస్తుంది..కాంగ్రెస్ దేశంలో చచ్చిపోయింది – సీఎం కేసీఆర్‌

-

బిజెపి గుండాయిజం చేస్తుంది..కాంగ్రెస్ దేశంలో చచ్చిపోయిందని విమర్శలు చేశారు సీఎం కేసీఆర్‌. నిన్న పార్టీ నేతలతో ప్రగతి భవన్‌ లో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఈడీ ,సిబిఐ కేసులతో రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీస్తుందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో చచ్చిపోయిందని.. దేశ పౌరులుగా మనం మన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

cm-kcr-telangana
cm-kcr-telangana

దేశంలో బిజెపికి ధీటుగా రాజకీయ శక్తి అవసరం ఉందని వెల్లడించారు. దేశంలో అన్ని సహజ వనరులు ఉన్న అభివృద్ధి జరగలేదని.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం పరిస్థితి మరింత దయనీయంగా తయారు అయ్యిందని తెలిపారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పై సమావేశంలో మాట్లాడిన కేసీఆర్… తెలంగాణను కావాలనే కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పథకాలకు ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోందన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రాల పట్ల వివక్ష తో వ్యవహరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామా …వద్దా ? అని నేతల అభిప్రాయాలు అడిగారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news