BREAKING : సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల

-

కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు. అయితే ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం వి రావు.. ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ కు ఎడమ చేయి లాగుతుంది అని.. ఆయన రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కెసిఆర్ కు ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటన చేశారు.

స్వల్ప అస్వస్థత కు గురి కావడంతో ఆయన ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని వైద్యులు ఎంవి రావు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏంజియోగ్రామ్, సిటి స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.

కాగా సీఎం కేసీఆర్ వెంట ఆయన భార్య, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఇక అటు ఉప్పల్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్… యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా సీఎం కేసీఆర్ వైద్య పరీక్షల నేపథ్యంలో ఇవాల్టి యాదాద్రి పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version