డ్రగ్స్ కేసుతో సీఎం కేసీఆర్ కు సంబంధం ఉంది – బండి సంజయ్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ తెరిపిస్తామని.. డ్రగ్స్ కేసుతో సీఎం కేసీఆర్ కు సంబంధం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా బయటకు తీస్తామన్నారు.

కవిత విచారణకు ఎందుకు పోతానని అంటే సిబిఐ ఊరుకోదని.. విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేసి మరీ తీసుకువెళతారని అన్నారు. కవితకి లిక్కర్ కేసుతో సంబంధం లేకపోతే విచారణకు హాజరు కావాలన్నారు. టిఆర్ఎస్ పార్టీలో 57 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారని.. అందుకే కెసిఆర్ భయపడుతున్నాడని అన్నారు. 37 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని.. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని వ్యాఖ్యానించారు.

ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై ఈడీ విచారణ జరిపించాలని యువకులు కోరుతున్నారని తెలిపారు. మంత్రిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బండి. నిర్మల్ లో మంత్రి కొత్త దందా స్టార్ట్ చేశారని.. నిర్మల్ సంగతేంటో చూస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news