ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు – కేసిఆర్

-

ఏపీ ప్రభుత్వం కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ఏపీ ప్రభుత్వమే కాకుండా బిజెపి లిస్ట్ లో తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఫై నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…నా దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కావు.. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం.. ఇది సింగిల్‌ కేసులా న్యాయవ్యవస్థ చూడవద్దు.. 24 మంది ముఠా ఉన్నామని వాళ్లే చెబుతున్నారు, మఠాధిపతుల రూపాలు, వేషాలు.. చేసేది దుర్మార్గ పనులు అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటికే ఫామ్‌హౌస్‌ ఫైల్స్‌ పంపించాం.. అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతాను.. దేశంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు వీడియోలను పంపుతున్నామనివెల్లడించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news