ఢిల్లీ పీఠమే కూలబోతోంది ? – సీఎం కేసీఆర్‌ సంచలనం

-

ఢిల్లీ పీఠమే కూలబోతోంది ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. నిన్న మొన్న మీరు టీవీల్లో కనిపించిన బ్రోకర్లు చాలా చిన్న అని… వాళ్ల వెనుక ఉన్న దొంగలు పెద్ధోళ్లని… వారి పేరు బయటకు వస్తే.. ఢిల్లీ పీఠమే దుమ్ము.. లేసిపోతుందని బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి.. వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌.

నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దు. మీ ఊరు వెళ్ళిన తర్వాత చర్చ చేసి నిజ నిజాలు తేల్చాలి. ఓటు అనేది మన తలరాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్ళు మరిచి ఓటేస్తే, ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి, మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడుతది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తదంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news