Breaking : నా కూతుర్ని పార్టీ మారమన్నారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా : సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించిన కేసీఆర్… బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలంటూ అడిగారన్న కేసీఆర్… ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు,పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విరుచుకుపడుతోందని విమర్శించారు సీఎం కేసీఆర్.

Kavitha back into KCR's confidential team!

బీజేపీ చేయించే ఈ దాడులను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. బీజేపీతో ఇక పోరాటమేనని కూడా వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కేసీఆర్… ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలపై పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని… ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తనకు అన్నీ తెలుసని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎవరూ బీజేపీకి లొంగవద్దని, సమావేశం వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దని కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. అందరిపై నిఘా ఉందని కేసీఆర్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని, ఈసారి కూడా సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news