సుధీర్ఘ పోరాటాలకు సిద్ధంగా ఉండండి… పార్టీ నేతకలు కేసీఆర్ దిశా నిర్థేశం…!

-

సీఎం కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో  పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈసమావేశంలో పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాాలు జారీ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, బొగ్గు గనుల వేలంపై  కేంద్రంలో దీర్ఘకాలిక పోరుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news