నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, కె.చంద్రశేఖర్‌ రావు ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీకి బ‌య‌లు దేరారు సీఎం కేసీఆర్‌. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌లు దేరిన కేసీఆర్‌తో తెలంగాణ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లడం హాట్‌ టాపిక్‌ గా మారనున్నారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపనున్నారు.

అనంతరం పలుగురు జాతీయ నేతలను కలవనున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్.. రెండు, మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం వేయననున్నారు. కాగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి పక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు సీఎం కేసీఆర్‌ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news