“తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్ జగన్”

-

పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం CPS ను రద్దు చేస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

జీపీఎస్‌తో విస్తృత ప్రయోజనాలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ (GPS) వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతున్నాయి. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (CPS) కన్నా ఇది మరింత మెరుగైన పథకం అని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ పథకం పెన్షన్ కు మరింత గ్యారెంటీ కల్పిస్తుంది. దీని అమలు తీరు సైతం సీపీఎస్‌లానే ఉంటుంది. ఉద్యోగి 10 శాతం ఇస్తే, దానికి సమానంగా ప్రభుత్వం ఇస్తుంది….

ys jagan

  • రిటైర్‌ అయ్యేముందు చివరి శాలరీలో బేసిక్‌లో 50శాతం పెన్షన్‌గా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌ అందే పెన్షన్‌ 150శాతం అధికం….
  • అలాగే ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తారు….
  • అంటే రిటైర్‌ అయిన వ్యక్తి… చివరి నెలబేసిక్‌ జీతం రూ.1 లక్ష ఉంటే.. అందులో రూ.50వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి 2 డీఆర్‌లతో కలుపుకుని ఇది ప్రతిఏటా పెరుగుతూ పోతుంది….
  • 62 సంవత్సరాలకు రిటైర్‌ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. రిటైర్‌ అయిన ఆ ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్‌ద్వారా పెన్షన్‌ రూ. 1,10,000 కి చేరుతుంది….
  • దీంతో రిటైర్‌ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది…..
    వారి జీవనవిధానానికి దెబ్బలేకుండా, సంతోషంగా ఉండేలా ఈ రక్షణ చర్యలను జీపీఎస్‌లో తీసుకున్నారు….
  • సీపీఎస్‌లో ఇలాంటి వెసులుబాటే లేదు….
  • కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్‌ తీసుకువస్తున్నామని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. కాని, ఇది అమల్లోకి రాలేదు. ఏంచేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నాయి.
  • రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగులకు ఉభయతారకంగా మేలు జరిగేలా అన్ని రకాల సమతుల్యతను పాటించేలా ఈ నిర్ణయం.
  • 2070 నాటికి జీపీఎస్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లుకు చేరుకుంటుంది.
  • ఇందులో రూ.1,19.520 కోట్లు ప్రభుత్వమే, బడ్జెట్‌ నుంచి భరించాల్సి వస్తుంది.

ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వేల మందికి ప్రయోజనం కలిగిస్తుంది. ఆర్టీసి, పాలిటెక్నిక్, విద్య, మెడికల్ , వైద్యం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తుండగా వారి పట్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి వారి సర్వీస్ రెగ్యులర్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news