“కలర్స్ స్వాతి” రీ ఎంట్రీ ఇస్తోంది..

-

పెళ్ళి చేసుకున్నాక సినిమాల్లో కనిపించకుండా పోయిన చాలామంచి హీరోయిన్లలో కలర్స్ స్వాతి ఒకరు. లండన్ బాబులు సినిమా తర్వాత పెళ్ళి చేసుకున్న స్వాతి, ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచమ్మా, కార్తికేయ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ భామ, మళ్ళీ సినిమాల్లోకి ఎంటీ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా స్వాతి నటిస్తున్న సినిమా నుండి ప్రకటన వచ్చింది. పంచతంత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో స్వాతి కీలక పాత్రలో కనిపిస్తుంది.

బ్రహ్మానందం, మత్తువదలరా ఫేమ్ నరేష్ అగస్త్య, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని నటిస్తున్న ఈ సినిమాలో స్వాతి నటిస్తుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రాజ్, పంచతంత్రం సినిమాకి హర్షతో కలిపి మాటలు రాస్తున్నాడు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news