మాతో కలసి రండి..బానిస బతుకు నుంచి విముక్తి కోసం కోట్లాడుదాం: రేవంత్ రెడ్డి

-

ఈ బానిస బతుకు నుంచి విముక్తి కోసం కోట్లాడుదాం.. మీరు మాతో కలిసి రండి.. తల తెగిపడ్డా వెనుకడుగు వేయబోను. కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరిమి కొట్టే దాకా పోరాడదాం.అని రేవంత్ రెడ్డి ప్రవాసులకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అన్నారు. ఆత్మగౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నామని.. ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు.

 

సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని అన్నారు. కెసిఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, వాళ్ళ బంధువులు రూ.వెల కోట్లు సంపాదించి రాష్ట్రాన్ని బందీ చేశారని ఆరోపించారు. ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయని రేవంత్ వ్యాఖ్యానించారు. తనపై 120 కేసులు పెట్టి జైల్లో వేసినప్పటికీ భయపడలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే వరకూ పోరాటం చేస్తూనే ఉంటాను అన్నారు. ఆ పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news