బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’ను తిరస్కరించిన ఉదయ్ కిరణ్..కారణాలివే..

-

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం మహేశ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కాగా, ఈ చిత్రం దివంగత హీరో ఉదయ్ కిరణ్ చేయాల్సిందట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత ‘అతడు’ సినిమాను ఉదయ్ కిరణ్ తో చేద్దామనుకున్నారట. ఈ ఫిల్మ్ విషయమై ఉదయ్ కిరణ్ జయభేరి ప్రొడక్షన్ హౌజ్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారని సమాచారం. అయితే, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు డేట్స్ లేకపోవడంతో సినిమా చేయలేనని త్రివిక్రమ్ కు చెప్పేశాడట. అలా ఈ సినిమా స్టోరిని మహేశ్ కు ‘నాని’ షూటింగ్ టైంలో చెప్పాడు మాటల మాంత్రికుడు.

అలా ఈ సినిమా ఉదయ్ కిరణ్ తిరస్కరణతో మహేశ్ బాబు వద్దకు వచ్చిందట. కాగా, మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. కామెడీ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ జనాలకు బాగా నచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news