కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై అధిష్టానం నజర్‌..

-

తెలంగాణలో ఇప్పుడిప్పుడే తిరిగి ఫాంలోకి వస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఊహించని రీతిలో విమర్శలు గుప్పించారు. అయితే.. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని… మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని చెప్పారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. మరోవైపు బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం నజర్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

KomatiReddy Rajagopal Reddy to Launch TV channel

రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెప్పించుకున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పార్టీపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news