షాకింగ్‌ : గ్యాంగ్‌స్టర్ అతిక్ సమాధిపై జాతీయ జెండాను కప్పిన కాంగ్రెస్ నేత

-

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ సమాధిపై కాంగ్రెస్ మంత్రి రాజ్‌కుమార్ ఇ ఈ రోజు జాతీయ జెండాను ఉంచడం వివాదాస్పదమైంది. అతను ‘కల్మా’ కూడా పఠించాడు. అంతేకాకుండా.. అతిక్ మరియు అష్రఫ్‌లకు గౌరవం పొందడానికి పోరాడతానని చెప్పాడం గమనార్హం. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, రాజ్‌కుమార్ రాజు సమాధిపై జాతీయ జెండాను కప్పి కల్మా పఠించడం చూడవచ్చు. అంతేకాకుండా.. “అతిక్ భాయ్ అమర్ రహే…”, అంటూ స్లోగన్‌ ఇచ్చింది కూడా వినవచ్చు.

Prayagraj Congress leader demands Bharat Ratna for Atiq Ahmed, salutes grave after placing tricolour on it

ఈరోజు తెల్లవారుజామున, ఉత్తరప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల 2023లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ సింగ్ అలియాస్ రజ్జు భయ్యా, అతిక్ అహ్మద్‌ను అమరవీరుడు అని పిలిచి వివాదాన్ని రేకెత్తించారు మరియు హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్తకు భారతరత్న అవార్డును డిమాండ్ చేశారు. అతిక్‌ అహ్మద్‌ అమరుడయ్యాడని, అందుకే ఆయన మృతదేహానికి త్రివర్ణ పతాకం చుట్టి ఉండాలని ఆయన అనడం చర్చనీయాంశంగా మారింంది. అతిక్ అహ్మద్ హత్యకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని రజ్జు భయ్యా ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అభ్యర్థి డిమాండ్‌ చేశారు. అతిక్ అహ్మద్‌కు భారతరత్న అవార్డు డిమాండ్‌ను సమర్థిస్తూ, రజ్జు భయ్యా దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు పద్మవిభూషణ్ లభిస్తే, అతిక్ అహ్మద్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఎందుకు రాకూడదని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news