స‌న్నీలియోనీ సాంగ్ పై వివాదం.. బ్యాన్ చేయాల‌ని డిమాండ్

-

బాలీవుడ్ బ్యూటీ స‌న్పీ లియోనీ ఇటీవ‌ల విడుద‌ల అయిన‌ ఆల్బ‌మ్ సాంగ్ మ‌ధుబ‌న్ కు నిన‌స‌న సెగ తగులుతుంది. ఈ సాంగ్ లో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని పురోహితులు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ పాట‌ను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వం బ్యాన్ చేయ‌కుంటే.. హై కోర్టు లో కేసు వేస్తామ‌ని అంటున్నారు. కాగ స‌న్నీ లియోనీ మ‌ధుబ‌న్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుద‌ల వ్యూస్ ప‌రంగా రికార్డులు సృష్టిస్తుంది.

ఈ పాట 1960లో వ‌చ్చిన కోహినూర్ సినిమా లోనిది. ఈ సినిమా లో ఈ పాటను ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌హ‌మ్ముద్ ర‌ఫీ పాడారు. అయితే ఈ పాటకు కాస్తా మెరుగులు దిద్ది ఆల్బమ్ సాంగ్ గా విడుద‌ల చేశారు. ఈ పాటలో రాధ‌ కృష్ణల ప్రేమను వ‌ర్ణిస్తు ఉంటుంది. అయితే అలాంటి పాట‌లో అభ్యంత‌ర‌క‌రంగా స‌న్నీ లియోనీ డ్యాన్స్ చేయ‌డం పై ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మ‌థుర కు చెందిన పురోహితులు అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ఈ పాట పై బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news