ఇండియాలో ఫోర్త్‌ వేవ్‌ టెర్రర్‌..24 గంటల్లో కొత్తగా 5వేలకు పైగా కేసులు

-

మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5233 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,90,282 కు చేరింది.


ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 28,857 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.96 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 07 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,715 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3345 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,36,710 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,43,26,416 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14,94,086 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news