తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది : త‌మ్మినేని వీర‌భ‌ద్రం

-

తెలంగాణలో 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఓపక్క అధికార టీఆర్ఎస్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును అభినందిస్తూనే… మరోపక్క ఆ పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేదంటూ వ్యాఖ్యానించారు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ‌కీయ వేడి చూస్తుంటే… అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం. 8 ఏళ్ల కాలంలో తెలంగాణ‌లో ఏ ఒక్క డిమాండ్ కూడా నెర‌వేర‌లేద‌ని కూడా అన్నారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం. ఈ కార‌ణంగానే వచ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలు గ‌ట్టెక్కించ‌లేవ‌ని జోస్యం చెప్పారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం.

Stop tribal 'expulsion' from forests: CPM

హైద‌రాబాద్ వేదిక‌గా ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ప్రభావాన్ని త‌గ్గించ‌డంలో కేసీఆర్ విజ‌యం సాధించార‌ని, బీజేపీని వ్య‌తిరేకిస్తూ కేసీఆర్ మంచి ప‌నే చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం. అయితే బీజేపీని వ్య‌తిరేకిస్తున్నార‌న్న కార‌ణంగా టీఆర్ఎస్‌తో త‌మ పార్టీ పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం. ప్ర‌జాస్వామ్య యుతంగా ధ‌ర్నాలు, స‌భ‌లు పెట్టుకునే స్వేచ్ఛ‌ను కూడా కేసీఆర్ ఇవ్వ‌డం లేదన్న త‌మ్మినేని వీర‌భ‌ద్రం.. మ‌హారాష్ట్రలో ఇటీవ‌ల చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్‌కు భ‌యం ప‌ట్టుకుందన్నారు. రాత్రిళ్లు కేసీఆర్‌కు నిద్ర ప‌డుతుందో, లేదోన‌ని కూడా ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు త‌మ్మినేని వీర‌భ‌ద్రం.

 

Read more RELATED
Recommended to you

Latest news