సైదాబాద్ సింగరేణి కాలనీలో వ్యక్తి దారుణ హత్య

-

సైదాబాద్ సింగరేణి కాలనీలో వ్యక్తిని దారుణ హత్య చేశారు. నేనవత్ లక్పతి అనే వ్యక్తి పై తీవ్రంగా దాడి చేసారు సింగరేణి కాలనీ వాసులు. హాస్పత్రిలో చికిత్స పొందుతూ లక్పతి మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లా దేవరకొండ చిత్రీయల్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. వెంకటేశ్వర వైన్స్ వద్ద లక్పతిని కొడుతున్నారు అంటూ భార్య విజయకు ఫోన్ వచ్చింది.

దీంతో భార్య వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో లక్పతి కనిపించాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో లక్పతి భార్య విజయ పిర్యాదు చేసింది. మకట్ లాల్, గణపతి, గణేష్, వెంకటేష్, సైదులు పై అనుమానం వ్యక్తం చేస్తూ పిర్యాదు చేసింది లక్పతి భార్య విజయ. సైదాబాద్ లో చిన్నారి చైత్ర ఘటన తర్వాత మద్యం, పాన్ మసాలా జర్ధా నిర్ములం పై పోరాటం చేస్తున్నాడు లక్పతి.

సింగరేణి కాలనిలో మద్యం, జర్ధా, పాన్ మసాలా అమ్మకూడదు, అమ్మకాలతో మన కుటుంబాలు రోడున్న పడుతున్నాయి అంటూ పలు చోట్ల స్టేటమేట్స్ ఇచ్చాడు లక్పతి. ఇది మనసులో పెట్టుకొని లక్పతి ని హత్య చేశారు అంటూ లక్పతి భార్య ఆరోపిస్తోంది. నిందితుల పై 324 R/W 34 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news